తెలుగు వారి లోగిళ్లలో ఆధ్యాత్మికత కు ఎంతో ప్రాధాన్యం ఉంది.. ఇంట్లో చిన్నారి పుట్టిన నాటి నుంచి పెద్దదై సమాజంలో ఒక స్థానం సంపాదించుకొనే దాకా ప్రతీ దశను ఒక వేడుకలా చేస్తారు. ఈ వేడుక నిర్వహించటం వెనుక అంతరార్థం ఉంది. దీనికి తోడు బాధ్యతను గుర్తు చేసే ఒక విశిష్టత ఉంది. అందుకే ఈ వేడుకల్ని మంత్ర పూర్వకంగా నిర్దేశించారు. ఈ మంత్రాల అర్థం తెలుసుకొంటే అద్భుతం అనిపిస్తుంది. జీవనం ఎలా సాగించాలి అనే దాన్ని విడమర్చి విశదీకరిస్తుంటారు. అందుకే ఆధ్యాత్మికత కు భారతీయ సమాజంలో అంతటి ప్రాధాన్యం..!
No comments:
Post a Comment